
టెండర్ రీకాల్కు కలెక్టర్ ఆదేశం
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ ట్యాంకుల నిర్మాణాల డీపీఆర్ రూపకల్పనకు మున్సిపల్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అయితే కేవలం ఒకే ఒక టెండర్ దాఖలవడం గమనార్హం. బల్దియా అధికారులు దానినే ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘కుమ్మక్కయ్యారా.. ఆసక్తి లేకనా’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. మరోసారి టెండర్లు ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఆఫ్లైన్లో టెండర్లు పిలవగా, ఈసారి ఆన్లైన్లో ఆహ్వానించాలని, ఇందుకు సంబంధించి జాతీయస్థాయి పత్రికల్లో నోటిఫికేషన్ ప్రకటించాలని సూచించారు. కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.