
లక్ష్యాలకు అనుగుణంగా రుణాలందించాలి
● బ్యాంకర్లకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
కై లాస్నగర్: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేసి రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కూడిన డిస్ట్రిక్ట్ కన్సల్టెటీవ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణాలతో పాటు పీఎం ఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ, నాబార్డు పథకాల లక్ష్యాలను సాధించే దిశగా బ్యాంకర్లు సహకరించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక చేయూత అందించాలని సూచించారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక యాక్షన్ ప్లాన్ను విడుదల చేశారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎల్డీఎం ఉత్పల్కుమార్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డీఏవో శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.