పలువురు డీపీఎంల బదిలీ | - | Sakshi
Sakshi News home page

పలువురు డీపీఎంల బదిలీ

Jun 26 2025 6:33 AM | Updated on Jun 26 2025 6:33 AM

పలువురు డీపీఎంల బదిలీ

పలువురు డీపీఎంల బదిలీ

కై లాస్‌నగర్‌: జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఇందులో భాగంగా పలువురు డీపీఎంలకు స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి 10.30గంటల వరకు కొనసాగింది. ఇందులో ఆర్‌.శోభారాణి, సుగంధ జిల్లాలోనే యథావిధిగా కొనసాగనున్నారు. హేమలత, గంగన్న నిర్మల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రమాకాంత్‌, నిర్మల్‌ నుంచి కే జ్ఞాను, జగిత్యాల నుంచి జాడి మల్లేశ్‌, కామారెడ్డి నుంచి ఎస్‌.వకుల, నిర్మల్‌ నుంచి వెంకటసాయిప్రసాద్‌ ఆదిలాబా ద్‌ జిల్లాకు రానున్నారు. కాగా, కౌన్సెలింగ్‌ హాజరైన వారిలో ఏ శోభారాణి, జాదవ్‌ శేషురావు, నరేందర్‌ను రిజర్వ్‌లో ఉంచారు. వీరికి ఆసిఫాబాద్‌ లేదా ఆదిలాబాద్‌లో పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు

గురువారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2025

ముగ్గురికి ఎస్సైగా పదోన్నతి

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో ముగ్గురు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ బుధవారం వారి భుజాలపై స్టార్‌ చిహ్నాలు అలంకరించి అభినందించారు. పదోన్నతితో బాధ్యతలు మరింతగా పెరుగుతాయన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఆదిలాబాద్‌ టూటౌన్‌ ఏఎస్సై ముకుంద్‌రావు, మావల ఏఎస్సైగా ఎండీ యూసుఫ్‌, రూరల్‌ స్టేషన్‌ ఏఎస్సై ఎండీ ఆరుఫ్‌ అలీఖాన్‌ ఉన్నారు. కానిస్టేబుల్‌గా అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ముగ్గురు స్నేహితులు అంచెలంచెలుగా ఎదుగుతునానరు. 1985లో కానిస్టేబుల్‌గా, 2011లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2016లో ఏఎస్సై, ప్రస్తుతం ఎస్సైగా పదోన్నతులు పొందారు. ఒకే రోజు విధుల్లో చేరినప్పటి నుంచి పదోన్నతులు పొందడం విశేషం. ఇందులో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ పోతారం శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ సీఐ గుణవంత్‌రావు, సీసీ రాజు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి

బేల: ప్రతి ఒక్కరూ టీబీ రహిత సమాజం కో సం కృషి చేయాలని డీఎంహెచ్‌వో రాథోడ్‌ న రేందర్‌ అన్నారు. మండలకేంద్రంలోని అశోక్‌నగర్‌ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వారం కంటే ఎక్కువ దగ్గు ఉన్న వారికి బుధవారం ని ర్వహించిన ఎక్స్‌రే పరీక్షల శిబిరాన్ని పరిశీలించారు. అలాగే నూతన పీహెచ్‌సీ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఆయనవెంట వైద్యాధికారి వంశీకృష్ణ, టీబీ నివారణ వైద్య బృందం సభ్యులు ఉన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం పరి శీలించారు. పట్టణంలోని భుక్తాపూర్‌ ఉర్దూ మీడియం, గెజిటెడ్‌ నం.1 పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్వీ నాయకులు ప్రశాంత్‌, కలీమ్‌, రఘు, మోసిన్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement