పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి

Jun 27 2025 4:23 AM | Updated on Jun 27 2025 4:23 AM

పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి

పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలని తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అధికారి నవీన్‌కుమార్‌ సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిశ్రమల శాఖ, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఎస్‌బీ ఐ, టీజీబీ ఆర్‌ఎంలతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) స్కీమ్‌ గురించి వివరించారు. 2025–26 సంవత్సరానికి ఇచ్చిన 70 యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పద్మభూషణ్‌ రాజు మాట్లాడుతూ.. ప్రభు త్వ నిబంధల మేరకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకువస్తున్న యువకులు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, జిల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రిసోర్స్‌ పర్సన్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement