
ఏసీబీ చిక్చిన అకౌంట్ ఆఫీసర్
లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి చిక్కారు. బిల్లు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.15వేలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025
చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నాం
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి
సమ్మె సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ కోరారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గోపికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లు వివరించారు. ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.సుజాత, పార్వతి, లత పాల్గొన్నారు.
న్యూస్రీల్

ఏసీబీ చిక్చిన అకౌంట్ ఆఫీసర్