
యూరియా బ్లాక్ చేయకుండా చర్యలు
ఆదిలాబాద్టౌన్: యూరియా ను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్స్వామి తెలి పారు. ‘బ్లాక్లో యూరియా.. దొడ్డిదారిన బడాబాబుల చెంతకు’ శీర్షికన గు రువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆ యన స్పందించారు. తాంసి ప్రాథమిక సహకా ర సంఘంలో 40 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వానాకా లం పంటకు జూన్ వరకు 18,786 మెట్రిక్ ట న్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులకు ఇతర ఎరువులు బలవంతంగా ఇవ్వరాదని సూచించారు. డీలర్లతో సమావేశమై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెండింగ్ కేసులు పర్యవేక్షించాలి
ఆదిలాబాద్టౌన్: కోర్టుల్లో పెండింగ్ కేసులను పర్యవేక్షించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. గురువారం ఏఆర్ హెడ్క్వార్టర్ స మావేశ మందిరంలో పోలీస్ సిబ్బందితో స మావేశమై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రో డ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చే పట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నా ణ్యత ప్రమాణాలు పాటించాలని, న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సా యంత్రం వేళ డ్రంకెన్ డ్రైవ్, హైవేల్లో స్పీడ్ లే జర్ గన్లు, సైన్బోర్డులు, రంబుల్స్టిక్లు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల నుంచి హైవేలకు వచ్చే దారుల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. నేరస్తులు క్రమంతప్పకుండా కోర్టుకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. హాజరుకాని ప క్షంలో వారెంట్లు తీసుకుని నిందితులకు అందజేయాలని సూచించారు. హైవేపై బ్లాక్స్పాట్, హాట్స్పాట్లను గుర్తించి ఎలాంటి సమస్యలు న్నా పరిష్కరించాలని వివరించారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, నాగేందర్ తదితరులున్నారు.