
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివేక్కు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఊహాగా నాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, వినోద్ సైతం పోటీలో ఉండగా చివరకు అధిష్టానం వివేక్కే మంత్రి పదవి కట్టబెట్టింది. వివేక్ వర్గీయులు శనివారం నుంచే సంబురాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నూర్కు చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
మంత్రిని కలిసిన నాయకులు
మంత్రి వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు నీలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచ్లు కుమ్మరిసంతోశ్, గట్టు లక్ష్మణ్ గౌడ్, తదితరులు కలిశారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే
చెన్నూర్ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం
ప్రేమ్సాగర్ రావు, వినోద్కు ఆశాభంగం
తీవ్ర నిరాశలో ప్రేమ్సాగర్రావు...
కొంతకాలంగా కేబినెట్లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచి ర్యాల ఎమ్మెల్యేకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివారం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్సాగర్రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయ నకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
హామీలు నెరవేర్చడమే లక్ష్యం..
నియోజక వర్గ ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలియజేశారు.

వివేక్ అనే నేను...