నీటి సంరక్షణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ పనుల పరిశీలన

Jun 9 2025 6:53 AM | Updated on Jun 9 2025 6:53 AM

నీటి సంరక్షణ పనుల పరిశీలన

నీటి సంరక్షణ పనుల పరిశీలన

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 2018 నుంచి 2025 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ‘జల్‌ సంచాయ్‌ జల్‌ భగీదారి’ పథకంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులను కేంద్ర జల కమిషన్‌ శాఖ ప్రతినిధి జతిన్‌ ఆదివారం పరిశలించారు. ఇంకుడు గుంతలు, పూడికతీత, చెక్‌డ్యాంలు, ఫారంపండ్‌ వంటి మొత్తం 7,285 నీటి సంరక్షణ పనులు చేపట్టగా ఎంపిక చేసిన 92 పనులను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష 5 వేల పనులు పూర్తి చేసి కేంద్ర జల కమిషన్‌కు ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో ఆదిలాబాద్‌ జిల్లా దేశంలోనే నాలుగో స్థానంలో, రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ఎంపిక చేసిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కమిషన్‌కు నివేదిక అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఏపీవో జాదవ్‌ శ్రీనివాస్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు మహేందర్‌, ధమ్మనంగ్‌, విఠల్‌, ప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement