
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు రికార్డులను నవీకరిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. పోలీసు యంత్రాంగానికి స్పెషల్ బ్రాంచ్ నిఘా వ్యవస్థలా పనిచేస్తుందని తెలిపారు. అనునిత్యం ప్రజలతో కలిసి ఉంటూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేందర్, ఇన్స్పెక్టర్లు మోహన్, సునిల్ కుమార్, కరుణాకర్రావు, వెంకటి, ఎస్సై అన్వర్ ఉల్హఖ్, ఏఎస్సై సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్లో
నమోదు చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాధితులు పోగొట్టుకు న్న రూ.13లక్షల విలువ గల వంద మొబైల్ ఫోన్లను స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో బాధితులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి రాబట్టడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే వంద ఫోన్లను స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 800 ఫోన్లు బాధితులకు అందించినట్లు వివరించారు. దొంగలించిన, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందేందుకు బాధితులు www.ceir.gov.in వెబ్సైట్తో పాటు సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్రావు, ఫణిందర్, రిజ ర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, ప్రత్యేక బృందాల సభ్యులు గోపీకృష్ణ, సంజీవ్, మజీద్, త్రిశూల్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు.