
నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
నేరడిగొండ: రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని డీఏవో శ్రీధర్స్వామి సూచించారు. మండల కేంద్రంలో ని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, నిల్వలు, ధరల పట్టిక, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విత్తనాలు కొన్న రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవో కృష్ణవేణి తదితరులున్నారు.
గ్రోమోర్ సేవా కేంద్రం ప్రారంభం
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రోమోర్ సేవా కేంద్రాన్ని డీఏవో శ్రీధర్స్వామి ప్రారంభించారు. ఏవో కృష్ణవేణి, గ్రోమోర్ ఏరియా మేనేజర్ (రిటైల్ ఆపరేషన్స్) వీఎన్ స్వామి, ఏరియా కంట్రోలర్ నరేంద్ర, న్యూ స్టోర్ ఆపరేషన్స్ ఇన్చార్జ్ గోపి, సెంటర్ మేనేజర్ అనిల్కుమార్, రైతులు పాల్గొన్నారు.