
టెక్నాలజీ జోడించి బోధించాలి
ఆదిలాబాద్టౌన్: అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధించాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఓదెలు కుమార్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని సూ చించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ అశోక్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, రి సోర్స్ పర్సన్లు విజయ్కుమార్, చంద్రశేఖర్, విద్యాసాగర్రెడ్డి, నవనీత్కుమార్ ఉన్నారు.