
తలమడుగు మండలం ఉండం నర్సరీలో నాటేందుకు సిద్ధంగా మొక్కలు
వన మహోత్సవానికి అంతా సిద్ధం
జిల్లా లక్ష్యం 46.57లక్షల మొక్కలు
గతేడాది కంటే 2.57 లక్షలు అదనం
పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు
కై లాస్నగర్: కనుమరుగవుతున్న అటవీ విస్తీర్ణంతో పాటు పచ్చదనం పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏటా వర్షాకాలంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి జి ల్లాలో 46,57,400 మొక్కలు నాటాలని లక్ష్యం వి ధించింది. గతేడాది కంటే ఈసారి 2.57లక్షల మొక్కలు అదనంగా నాటాలని నిర్దేశించింది. జూన్ మొ దటి వారంలో కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, ఎన్జీవో లు, ప్రజలను పెద్దఎత్తున భాగస్యాములను చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. మున్సిపాలిటీలో ప్రతీ ఇంటికి ఐదు పూలు, పండ్ల మొక్కలు అందించి నాటేలా చూడాలని ఆదేశించింది.
పచ్చదనం పెంపే లక్ష్యంగా..
ఆదిలాబాద్ అడవుల జిల్లాగా ముద్రపడ్డప్పటికీ చె ట్లను విక్షణారహితంగా నరికివేయడంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది. తిరిగి దీనిని పెంచాలని భావించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరిట విరివిగా మొక్కలు నాటింది. తద్వారా పచ్చదనం పెరిగినా చాలాచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొక్కల పెంపకానికి అదే ప్రాధాన్యతనిస్తోంది. వనమహోత్సవం పేరిట కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రైతుల నుంచి టేకు మొక్కలు కావాలని డిమాండ్ ఉన్నా నర్సరీల్లో వాటిని పెంచడంలేదు. గతేడాది టేకు మొక్కల పెంపకానికి అనుమతివ్వాలని అటవీశాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన రాలేదు. ఈసారి కూడా టేకుమొక్కలు నాటే అవకాశం లేదు.
18శాఖలకు భాగస్వామ్యం
జిల్లాలోని 473 గ్రామపంచాయతీలు, ఏకై క ఆదిలా బాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 17ప్రధాన ప్రభుత్వశాఖ లు, మరో ఒకట్రెండు ఇతర శాఖలను భాగస్వాములను చేయనున్నా రు. ఆయా శాఖ లు నాటాల్సిన మొక్కల ల క్ష్యాలను నిర్దేశించారు. ఇందుకు అ వసరమైన మొక్కలను జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధిహామీ కింద నిర్వహిస్తున్న నర్సరీల్లో సిద్ధం చేశారు. వీటితో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొమ్మిది నర్సరీల్లోనూ మొక్కలు సిద్ధంగా ఉన్నా యి. వాటిలో గుల్మొహర్, వేప, కానుగ, బూరు గు, చింత మొక్కలతో పాటు పండ్లకు సంబంధించి న దానిమ్మ, మామిడి, నిమ్మ, పూలకు సంబంధించి మందార, గులాబీ, మల్లె లాంటి మొక్కలు పెంచా రు. కొన్నిచోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. వర్షాలు కురిసే నాటికి అవి అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నా రు.
కార్యక్రమ నిర్వహణపై సమావేశం
కార్యక్రమం నిర్వహణపై ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పండ్లతోటలు, వెదురు పెంపకం, మూలిక లు, ఈత, ఖర్జూరా తదితర మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
గతేడాది కంటే అదనం
2023 కంటే గతేడాది లక్ష మొక్కలు తగ్గించగా ఈసారి రెట్టింపుగా లక్ష్యం పెంచారు. శాఖ లవారీగా మార్పులు చేశారు. గతేడాది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ)కు 25లక్షలు కాగా, ఈసారి 2.87లక్షలు అదనంగా కేటాయించారు. అటవీశాఖకు గతేడాది 8లక్షలు కాగా, ఈసారి 5.76లక్షలే కేటాయించారు. మున్సిపాలిటీకి గతేడాది 5లక్షలు కాగా, ఈసారి 2.76లక్షలు అదనంగా లక్ష్యం విధించారు. వ్యవసాయశాఖకు ఈసారి 77వేలు అదనంగా కేటాయించారు. పోలీస్శాఖకు 8,100 తగ్గించారు. విద్యాశాఖకు గతంలో లక్ష కేటాయించగా ప్రస్తుతం 5,600 మా త్రమే నాటాలని నిర్ణయించారు. ఈసారి ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖలు, మత్స్యశాఖ, ఉద్యానవన, డిగ్రీ కళాశాలలు, ఎకై ్సజ్, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను లెక్కలోకే తీసుకోలేదు. ఇతర శాఖల్లోనూ వందలలోపే మొక్కలు నాటేలా ప్రణాళిక నిర్దేశించారు.
జిల్లా వివరాలు
జిల్లాలోని మండలాలు : 21
గ్రామపంచాయతీలు : 473
మొక్కల లక్ష్యం : 46.57లక్షలు
గతేడాది నాటిన మొక్కలు : 44లక్షలు
జిల్లాలో శాఖలవారీగా మొక్కల లక్ష్యం
ప్రభుత్వ శాఖ, మొక్కల లక్ష్యం
అటవీశాఖ, 5.76లక్షలు
ఆర్అండ్బీ, 50,500
డీఆర్డీఏ, 27.87లక్షలు
గిరిజన సంక్షేమశాఖ, 50వేలు
ఇరిగేషన్, 22వేలు
వ్యవసాయశాఖ, 2.77లక్షలు
రెవెన్యూశాఖ, 10,100
మున్సిపల్శాఖ, 7.76లక్షలు
పోలీస్శాఖ, 91,900
విద్యాశాఖ, 5,600
పశుసంవర్ధక, డెయిరీ
మత్స్యశాఖ, 600
పరిశ్రమలశాఖ, 500
వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ, 300
విద్యుత్శాఖ, 500
సంక్షేమశాఖలు, 900
యువజన వ్యవహారాలు సాంస్కృతిక శాఖ, 10వేలు
సివిల్ సప్లయ్శాఖ, 2వేలు
ఇతర శాఖలు, 500