
నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ
నాట్య మయూరాలు
శాసీ్త్రయ నృత్యంలో రాణిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు బాలకేంద్రం చిన్నారులు. కూచిపూడిలో గిన్నిస్రికార్డులో స్థానం దక్కించుకున్నారు.
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
ప్రశాంతంగా జీపీవో రాత పరీక్ష●
కై లాస్నగర్: గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామకం కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప ట్టణ శివారులోని నలంద డిగ్రీ కళాశాలలో ని ర్వహించిన పరీక్షకు 83 మంది హాజరుకా వాల్సి ఉండగా 73 మంది హాజరయ్యారు. ప ది మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులను క్షు ణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అ నుమతించారు. కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నిర్వహణ తీరుపై ఆరా తీశారు.
‘డీసెట్’కు 12 మంది గైర్హాజరు
కై లాస్నగర్: డీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన డీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ శివా రులోని నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చే సిన కేంద్రంలో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించినసెషన్లో 101 మందికి గాను 95 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 100మందికి గాను 94 మంది హాజరయ్యారు. మొత్తం 12 మంది గైర్హాజ రైనట్లు అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్అర్బన్: ముందస్తు వర్షాలు.. నైరుతి ఆగమన కబురు నేపథ్యంలో జిల్లాలోని రైతులు వానా కాలం సాగుకు సన్నద్ధమయ్యారు. పత్తితో పాటు ఇతర పంటల విత్తనాల కొనుగోలుకు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి విత్తనాల ఎంపిక విషయంలో ఆచీ తూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది రైతులు కొనుగోలు చేయగా, శుభఘడియలు రాగా నే కొనేందుకు మిగతా వారు సిద్ధమవుతున్నారు.
అందుబాటులో సరిపడా విత్తనాలు..
వానాకాలం సీజన్కు సంబంధించి వ్యవసాయశాఖ అన్ని రకాల విత్తనాలు సిద్ధం చేసింది. జిల్లాకు సరఫరా అయిన విత్తనాలను ఆయా మండలాలు, గ్రా మాల వారీగా రైతులకు అందుబాటులో ఉంచింది. జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆ విత్తనాలపై ఎక్కువ ఫోకస్ పెంచింది. మరో వారం రోజుల్లో వానాకాలం పనులు ఊపందుకోనున్న తరుణంలో విత్తనపరంగా ఎలాంటి లోటు రానియ్యకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా లైసెన్స్డ్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి రైతులకు మాత్రమే విక్రయించేలా దృష్టి సారించింది.
అందుబాటులో 13.15 లక్షల ప్యాకెట్లు
జిల్లాలోని రైతులకు ఈసారి పత్తి విత్తన సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గతంలో విత్తనాలు దొరక్క దుకా ణాల ఎదుట భారీ క్యూలైన్లు, షాపుల ముందు రైతుల పడిగాపులు, నకిలీ విత్తనాల సరఫరా, ప్రైవేట్ వ్యాపారుల మాయాజాలం వంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తమైంది. ఈ సారి ముందుగానే సరిపడా మించి విత్తనాలు అందుబాటులో ఉంచింది. జిల్లాలోని 297 దుకాణాల్లో 13.15 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్లో అత్యల్పంగా మావల మండలంలో ఉన్నాయి.
విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు (ఫైల్)
న్యూస్రీల్
మండలాల వారీగా అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల ప్యాకెట్లు..
మండలం దుకాణాలు ప్యాకెట్లు
ఆదిలాబాద్రూరల్ 04 1487
ఆదిలాబాద్అర్బన్ 69 631945
బజార్హత్నూర్ 07 8320
బేల 31 182887
భీంపూర్ 09 11499
భోరజ్ 03 559
బోథ్ 17 70211
ఇచ్చోడ 24 121605
గాదిగూడ 06 18735
గుడిహత్నూర్ 11 15302
ఇంద్రవెల్లి 21 64834
జైనథ్ 10 4521
మావల 01 325
నార్నూర్ 11 27850
నేరడిగొండ 13 49173
సాత్నాల 03 3017
సిరికొండ 04 11928
సొనాల 06 10549
తలమడుగు 16 29455
తాంసి 14 22209
ఉట్నూర్ 16 29340
అందుబాటులో ఉంచాం..
రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాం. డిమాండ్ మేరకు అన్ని రకాల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో వర్షాలు కురిశాకే విత్తుకోవడం మేలు. – శ్రీధర్ స్వామి,
జిల్లా వ్యవసాయ అధికారి

నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ

నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ

నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ

నైరుతి ఆగమనానికి ముందే రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ