చదువుతోనే గిరిజనుల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే గిరిజనుల అభివృద్ధి

May 25 2025 12:38 AM | Updated on May 25 2025 12:38 AM

చదువుతోనే గిరిజనుల అభివృద్ధి

చదువుతోనే గిరిజనుల అభివృద్ధి

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

నార్నూర్‌: చదువుతోనే గిరి గ్రామాల అభివృద్ధి సా ధ్యపడుతుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నా రు. గాదిగూడ మండలంలోని కుండి, షేకుగూడ, పిప్రి (జి), పూనగూడ గ్రామాల్లో పోలీస్‌ మీకోసం కార్యక్రమాన్ని ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడా రు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నతంగా చది వించాలని సూచించారు. త్వరలోనే గాదిగూడలో అ గ్నివీర్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ శిబిరం ప్రారంభిస్తామని తెలిపారు. యువత సన్మార్గంలో పయనించాలని సూచించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ను కేటాయించామన్నారు. ఎలాంటి సమస్యలున్నా డయల్‌ 100 లేదా విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. అనంతరం నాలుగు గ్రామాల్లోని యువతకు క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కిట్లను అందజేశారు. క్రీడారంగంలో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నార్నూర్‌ సీఐ రహీంపాషా, గాదిగూడ ఎస్సై జీవన్‌రెడ్డి, ఆదివాసీ నాయకుడు మెస్రం శేఖర్‌, మాజీ వైస్‌ ఎంపీపీ యోగేష్‌, గ్రామ పటేళ్లు లక్ష్మణ్‌, పైకు, జంగు, రమేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement