
అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్కార్డు
కైలాస్నగర్: అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్కార్డు అందిస్తామని జిల్లా పౌరసరఫరా ల అధికారి మహ్మద్ వాజీద్ అలీ అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన సర్వేను మావల మండల పరిధిలోని షాద్నగర్, కై లాస్నగర్ కాలనీల్లో రెవెన్యూ సిబ్బంది శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సర్వే తీరును పరి శీలించారు. పలువురు దరఖాస్తుదారుల కు టుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నాయబ్ తహసీల్దార్ రాథోడ్ బాబుసింగ్, సీనియర్ అసిస్టెంట్ వినోద్రావు, రికార్డు అసిస్టెంట్ వెంకన్న తదితరులున్నారు.