సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

May 10 2025 7:55 AM | Updated on May 10 2025 7:55 AM

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేరస్తుల ను పట్టుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సెంట్రల్‌ డిటెక్టివ్‌ ద్వారా స్థానిక పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో నూతన ఎస్సైలు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్‌ నేరస్తులు వినియోగించే ఆపరేటింగ్‌ సిస్టం, ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ వంటివి కనుగొనే పద్ధతులను వివరించారు. అలాగే న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షలు పడేందుకు కావాల్సిన పంచనామా రాసే విధానం, ముఖ్యంగా మహిళల మి స్సింగ్‌ కేసులు, సైబర్‌ క్రైమ్‌ ఫ్రాడ్‌ కేసుల్లో విచారణ చేసే పద్ధతులపై పూర్తి పరిజ్ఞానం సంపాదించాలని సూచించారు. ఇందులో జైనథ్‌ సీఐ డి.సాయినాథ్‌, రూరల్‌ సీఐ కె.ఫణిదర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకటి, అఖిలేష్‌రావు, సైబర్‌ ఎక్స్‌పర్ట్‌ శ్రీధర్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ మహేందర్‌రెడ్డి, సీడీఆర్‌, ఐపీడీఆర్‌ ఎక్స్‌పర్ట్‌ హైదరాబాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మట్టి తవ్వకాలకు

దరఖాస్తుల స్వీకరణ

కై లాస్‌నగర్‌: జిల్లాలో మట్టి తవ్వకాల అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్‌ రాజర్షి షా ప్రకటనలో తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ గనులు, భూగర్భశాఖ, నిజామాబాద్‌ (mines.telangana.go v.in) వెబ్‌సైట్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. మొద టి మట్టి/గ్రావెల్‌ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, మండల సర్వేయర్‌, లైసెన్స్‌ సర్వేయర్‌తో స్కెచ్‌ గీయించుకుని, పాస్‌బుక్‌, ఆధార్‌కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి సర్వే, తనిఖీ అనంతరం ఆదిలాబాద్‌ ఉప సంచాలకులకు పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement