అర్హులకే ఇళ్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇళ్లు కేటాయించాలి

May 9 2025 1:22 AM | Updated on May 9 2025 1:22 AM

అర్హులకే ఇళ్లు కేటాయించాలి

అర్హులకే ఇళ్లు కేటాయించాలి

నార్నూర్‌: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా లని రెండోరోజు గురువారం దరఖాస్తుదారులు మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌ గాంధీ చౌక్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం వీరికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్‌ నాయకులే ఉండడంతో వారి కుటుంబ సభ్యులకే ఇళ్లు కేటాయించుకున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ సూచన మేరకు కమిటీలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించాలని కోరారు. పాత కమిటీలు రద్దు చేసి, అన్ని వర్గాల వారితో కొత్త కమిటీలు వేసి అర్హులకే ఇళ్లు దక్కేలా చూడాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ గంగాసింగ్‌ ఆందోళన వద్దకు చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తానని చెప్పగా ఆందోళన విరమించారు. కలెక్టర్‌, జెడ్పీ సీఈవో ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డీఎల్‌పీవో ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పా టు దరఖాస్తుదారులతో సమావేశమయ్యారు. అ క్కడా ఇందిరమ్మ కమిటీ రద్దు చేయాలని పట్టుపట్టారు. ఇందిరమ్మ కమిటీ నిర్ణయం ప్రకారమే ఇళ్లు కేటాయించామని, మార్పు ఉండదని డీఎల్‌పీవో చెప్పారు. రాని వారికి మరో విడతలో మంజూరు చేయనున్నట్లు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ దృష్టికి సమస్య తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో శాంతించారు. బీజేపీ మండలాఽ ద్యక్షుడు భిక్షపతి రాథోడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు చాల్కుర్‌ ప్రకాశ్‌, పెసా చట్టం కోఆర్డినేటర్‌ రాథోడ్‌ సీకేందర్‌, అన్నాభావు సాఠె కమిటీ మాజీ మండలాధ్యక్షుడు రాజ్‌పంగే రాజు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement