
పహల్గాం బాధితులకు సిందూర్తో నివాళి
ఆదిలాబాద్: పహల్గాం బాధితులకు ఆపరేషన్ సిందూర్ ఘన నివాళి అందించింది అని సనాతన హిందూ ఉత్స వ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అ న్నారు. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంపై సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించా రు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇస్తూ టపాసులు కాల్చారు. ఇందులో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగా నంద సరస్వతిస్వామి, సమితి సభ్యులు కె.రవీందర్, ఆర్. రవీందర్, వేణు, సత్యం, నర్సింలు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, అశోక్రెడ్డి, దేవన్న, ఎల్వి రావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.