అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

May 7 2025 12:07 AM | Updated on May 7 2025 12:07 AM

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

కై లాస్‌నగర్‌: అర్హులైన వారినే ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని కేఆర్‌కే, రాంనగర్‌, భాగ్యనగర్‌ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను, చెక్‌లిస్ట్‌ను పరిశీలించారు. ప్రా థమిక జాబితాలో ఉన్న పేర్లను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజను ఆదేశించారు. అంతకు ముందు గూగుల్‌ మీట్‌ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులని గుర్తిస్తే వారి పేర్లను చేర్చాలని సూచించారు.

తాంసిలో..

తలమడుగు(తాంసి):తాంసి మండలంలోని హస్నాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను కలెక్టర్‌ పరిశీలించారు. అర్హులైనప్పటికీ తమపేరు జాబితాలో రాలేదని పలువురు దరఖాస్తుదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు. వారి వెంట జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మి, హౌసింగ్‌ ఏఈ నజీర్‌, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.

కలెక్టర్‌ రాజర్షి షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement