
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్నగర్: ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని గ్రా మ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న కోరారు. ఈ మేరకు సోమవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె నోటీసు అందజేశారు. పంచాయతీ కా ర్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న సమ్మెలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, వెంకట్రావు, సోనేరావు, గంగన్న, కిరణ్, సంతోష్, రాజేందర్, శంకర్ ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీసు
ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ఆదిలా బాద్ మున్సిపాలిటీ కార్మికులు పాల్గొనాలని మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ సీవీఎన్.రాజును కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఇందులో సంఘ బాధ్యులు జనార్దన్, భిక్షపతి, శ్యామ్ తదితరులున్నారు.