
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
తాంసి: రైతులు వానాకాలం సాగుకు సంబంధించి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల ను ఎంపి క చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రా మంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పంచాయ తీ కార్యాలయ ఆవరణలో రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సా ధించే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పంటమార్పిడితో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం,సాగునీటిఆదా, మట్టి పరీక్షలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగా హన కల్పించారు. ముందుగా రైతులతో కలిసి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రవీణ్కుమార్,శాస్త్రవేత్తలు రాజ శేఖర్, మోహన్దాస్, శేషా ద్రి, సునీల్ కుమార్, జి.శివచరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి, ప్రవీణ్, తాంసి ఇన్చార్జ్ ఏడీఏ రవీందర్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, రైతులు పాల్గొన్నారు.