
ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే కీచైన్స్ పంపిణీ చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణికులకు శనివారం క్యూఆర్ కోడ్ కీచైన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అందిస్తున్న సేవలు, సమగ్ర సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్, దేవిదాస్, పాల్గొన్నారు.