భూభారతి పైలట్‌ మండలంగా భోరజ్‌ | - | Sakshi
Sakshi News home page

భూభారతి పైలట్‌ మండలంగా భోరజ్‌

May 4 2025 6:42 AM | Updated on May 4 2025 6:42 AM

భూభారతి పైలట్‌ మండలంగా భోరజ్‌

భూభారతి పైలట్‌ మండలంగా భోరజ్‌

● రేపటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని భోరజ్‌ మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోరజ్‌ మండలంలో 28 గ్రామాల్లో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుల్లో భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రామానికి వెళ్లే ముందు రోజు గ్రామస్తులకు తెలిసేలా టామ్‌ టామ్‌ వేయించాలన్నారు. సంబంధిత అఽధికారులు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్‌ 2 వరకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్‌లో ఉన్నవారు, పట్టాలు ఉండి పొజిషన్‌లో లేని వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హైకోర్టు అనుమతులు రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని, ఈమేరకు అవసరమైన కార్యాచరణ పూర్తిచేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్లు, సర్వేల్యాండ్‌ రికార్‌ుడ్స ఏడీ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement