సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

May 4 2025 6:42 AM | Updated on May 4 2025 6:42 AM

సార్వత్రిక సమ్మె   జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

కై లాస్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌ కోరారు. తెలంగాణ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, వర్క ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ సీవీ ఎన్‌ రాజును శనివారం కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్‌లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్‌ నాయకులు అశోక్‌, ఉషన్న, నరేందర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement