పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి

May 2 2025 1:08 AM | Updated on May 2 2025 1:08 AM

పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి

పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి

కై లాస్‌నగర్‌: రానున్న వానాకాలం సీజన్‌లో పత్తి విత్తనాల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాల ని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి విత్తనాల లభ్యతపై కంపెనీ లు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఏడాది జిల్లాలో 4లక్షల 40వేల ఎకరాల్లో పత్తి పండించవచ్చని అంచనా ఉందని, ఇందుకు 11 లక్ష ల విత్తన ప్యాకెట్లు అవసరం కాగా వివిధ కంపెనీలు 21లక్షల 61వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచా యన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు అరికట్టేలా చూడాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గ్రామాల వారీగా షెడ్యూల్‌ రూపొందించి విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామలాదేవి, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్‌ కుమార్‌, డీఎస్పీ జీవన్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాజర్షి షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement