
‘సీఐటీయూ పోరాటాలతోనే వేసవి సెలవులు’
ఆదిలాబాద్: సీఐటీయూ ఐక్య పోరాటాల ఫలితంగానే అంగన్వాడీ కేంద్రాలకు మేలో వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కేక్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రాజీలేని ఆందోళనలతోనే మంత్రి సీతక్క సెలవులు ప్రకటించారన్నారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం అ ధికారికంగా సర్క్యులర్ రాలేదని అనడం సరి కాదన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యల పరిష్కా రం కోసం, హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, నాయకులు మల్లి కాంబ, మధునిక, కవిత, ప్రియాంక, మనీషా, పద్మ, జయశ్రీ, శకుంతల, లక్ష్మి, పాల్గొన్నారు.
జూన్ 3 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 16 వరకు పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.