కలెక్టరేట్‌ ఎదుట తుడుందెబ్బ ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట తుడుందెబ్బ ధర్నా

May 2 2025 1:08 AM | Updated on May 2 2025 1:08 AM

కలెక్టరేట్‌ ఎదుట తుడుందెబ్బ ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట తుడుందెబ్బ ధర్నా

కైలాస్‌నగర్‌: ఆదివాసీలపై జరుగుతున్న మారణహోమం, దమనకాండను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల పేరిట వేలాది మంది ఆదివాసీలను హతమార్చడం శోచనీయమన్నారు. ఆదివాసీ మహిళలపై అత్యాచారం, హత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. అనంతరం అధికారులెవరూ రాకపోవడంతో కలెక్టరేట్‌ మెయిన్‌ గేట్‌కు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు వెట్టి మనోజ్‌, గోడం రేణుక, ఉయిక ఇందిర, ఆత్రం గణపతి, కుడ్మెత జంగు, దుర్వ జుగాదిరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement