
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్రూరల్: వేసవి సెలవుల్లో ఉచిత ంగా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం యాపల్గూడ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా కంప్యూటర్ ల్యాబ్ (ఏఐ) వేస వి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమ ంలో భా గంగా విద్యార్థులకు తరగతిని బట్టి కంప్యూటర్, డ్యాన్స్, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్, పాటలు, తదితర శిక్షణ ఇవ్వనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుజాత్ఖాన్, శ్రీకాంత్గౌడ్, ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.