
విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి
నేరడిగొండ/బజార్హత్నూర్: విద్య, ఉపాధి రంగా ల్లో వెనుకబడిన ఆదివాసీ పర్ధాన్లకు అవకాశాలు కల్పించాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు ఉయిక సుదర్శన్ అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నోడల్ అధికారి దివ్యదేవరాజన్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని తొమ్మిది ఆదివాసీ గిరిజన తెగల్లో వెనుకబాటులో ఉన్న పర్ధాన్ తెగ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు అందించేలా కృషి చేయాలన్నారు. అలాగే హీరాసుక్కా జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని విన్నవించారు. ఆయన వెంట పుర్క జంగురావు, ఇచ్చోడ మార్కెట్ డైరెక్టర్ నాగేశ్వర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సిడాం ఉత్తమ్, కేశవ్, గణేశ్, సుభాష్, నాగనాథ్, గంగాసాగర్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.