ప్చ్‌.. నిరాశే! | - | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. నిరాశే!

Mar 26 2025 12:34 AM | Updated on Mar 26 2025 12:34 AM

ప్చ్‌.. నిరాశే!

ప్చ్‌.. నిరాశే!

● ‘యంగ్‌ ఇండియా’ మంజూరులో జిల్లాకు మొండిచేయి ● వసతులు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతానికే ప్రాధాన్యత ● నాణ్యమైన విద్యకోసం జిల్లావాసులకు తప్పని నిరీక్షణ

కై లాస్‌నగర్‌: నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థా యి విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరులో జిల్లాకు నిరాశే ఎదురైంది. 2500మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగ తి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో చేపట్టనున్న ఈ పాఠశాలల ఏర్పాటులో ప్రభుత్వం జిల్లాకు మొండిచేయే చూపింది. తొలి విడతలో మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్‌ జిల్లాను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

ఇదీ పరిస్థితి...

పేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, నైపుణ్యశిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు క్రీడలు, వృత్తినైపుణ్యంతో కూడిన నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ని యోజకవర్గానికో పాఠశాలను ఏర్పాటు చేయాల ని నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన స్థలాలు గుర్తించాల్సిందిగా ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల విస్తీర్ణంతో కూడిన స్థలా లను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. పది నియోజకవర్గాలకు సంబంధించి స్థలా లు గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు సి ద్ధంగా ఉండటంతో జిల్లాలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనంద అందనందని అంతా భా వించారు. అయితే ప్రభుత్వం మాత్రం జిల్లాను ప ట్టించుకోలేదు.

స్థలాలు సిద్ధంగా ఉన్నా..

తరగతి గదులు, వసతిగృహాలు, ఆటస్థలం వంటి సౌకర్యాలకు అనుగుణంగా ఉండేలా ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్ర భుత్వ ఆదేశాలకనుగుణంగా అవసరమైన స్థలాల ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎంపిక చేశారు. ఆయా కలెక్టర్ల పర్యవేక్షణలో పది నియోజకవర్గాల్లోనూ రెవెన్యూ అధికారులు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే జిల్లాలోని ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి గాను ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం నిషాన్‌ఘాట్‌లో, బోఽథ్‌ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చోడ మండలం ఆడెగామ గ్రామంలో 25 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.

జిల్లాకు మొండిచేయి...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవ్గరాలకు ఈ పాఠశాలలు మంజూరు కావాల్సి ఉండగా రా ష్ట్ర ప్రభుత్వం తూర్పు ప్రాంతానికే ప్రాధాన్యతని చ్చింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల ని యోజకవర్గానికి సంబంధించి దండెపల్లి మండలం రెబ్బనపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గానికి సో మ న్‌పల్లి, కుమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్‌ ని యోజకవర్గానికి సంబంధించి వాంకిడి మండలం ఇందానిలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను మంజూరు చేసింది. అయితే ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు ఏడు నియోజకవర్గాలను విస్మరించింది. అత్యధికంగా ఆదివాసీలు, వెనకబడిన ప్రా ంతమైన ఆదిలాబాద్‌కు ఒక్క పాఠశాలను మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతోనే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమువుతుంది.

ఉమ్మడి జిల్లాకు మూడు మంజూరు..

ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లా కు రెండు, ఆసిఫాబాద్‌ నియోజవకర్గానికి ఒక పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.200 కోట్లతో చేపట్టనున్న భవ న నిర్మాణాలకు గాను తొలివిడతగా ఒక్కో పాఠశాలకు రూ.30 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. మిగతా నియోజకవర్గాల్లో మలి విడతలో మంజూరు ఉంటుంది.

– అశోక్‌, టీజీఈడబ్ల్యూఐడీసీ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement