
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
ఆదిలాబాద్టౌన్: పోలీసు బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గతేడాది తాంసి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ ఎం.గంగన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన భార్య ప్రమీళకు మంగళవారం పోలీసు కార్యాలయంలో రూ.8 లక్షల భద్రత చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో భక్త ప్రహ్లాద్, సీసీ దుర్గం శ్రీనివాస్, సూపరింటెండెంట్ గంగాధర్, వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.