
అభివృద్ధిలో నార్నూర్ భేష్
నార్నూర్: నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్లో భాగంగా పీఎం అవార్డు–2024కు ఎంపికై న నా ర్నూర్ మండలం అభివృద్ధిలో భేష్గా ఉందని కేంద్రం బృందం ప్రతినిధులు అన్నారు. ఈ మే రకు డైరెక్టర్ మృత్యుంజయ ఝా, డిప్యూటి సెక్రెటరీ శుభోద్కుమార్ మండలంలో మంగళవారం పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకున్న వారికి కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటలకు జామ్డా గ్రామానికి చేరుకున్నారు. వీరికి ఆదివాసీ సంప్రదాయ పద్ధతిన గ్రామస్తులు స్వాగతం పలికారు. తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మాతా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బరు వు తక్కువ ఉన్న పిల్లల ఆరోగ్యానికి తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు. పోషణ్ అభియా న్లో భాగంగా అందజేస్తున్న పోషకాహార వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలామృతం, గుడ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. అలాగే రక్తహిన త బాధితులను గుర్తించి ఉట్నూర్ ఎన్ఆర్సీ లేదా ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తున్నట్లు తెలి పారు. అదే గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఐటీడీఏ ద్వారా గిరిజన విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్న ట్లు పీవో వివరించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. రక్తహీనత నివారణకు మొవాహా లడ్డూలను అందజేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి సబ్సెంటర్ భవన్, ఎంపీపీఎస్ను సందర్శించారు. విద్యాబోధన అమలుతీరును ఉపాధ్యాయులను అడి గి తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎంఈవో అనిత వివరించారు. అనంతరం తాడిహత్నూర్ సమీపంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పాంలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. పీఎం కిసాన్ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఎస్హెచ్జీ మహిళా సంఘాల ఆర్థిక స్వావలంభన కోసం అందిస్తున్న పథకా లను పరిశీలించారు. ఇప్పటి వరకు గ్రామంలో ఎన్ని యూనిట్లు మంజూరు చేశారు.. వాటి వినియోగం ఎలా ఉంది.. తదితర వివరాలను గ్రూపు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారు తయారు చేసిన వెదురు బొమ్మలను పరి శీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రో గులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. సబ్సెంటర్లో కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతీ కాన్పు ప్రభుత్వ ఆస్పత్రి లో అయ్యేలా 102, 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకుంటున్నామని డీఎంహెచ్వో నరేందర్ వివరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో వారు సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా టాప్ 30 లో రెండో స్థానంలో నార్నూర్ మండలం ఎంపికై ందని తెలిపారు. ఇందులో భాగంగా మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పని తీరు బాగుందని ప్రశంసించారు. వారి వెంట ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీసీఈవో జితేందర్రెడ్డి, డీఈవో ప్రణీత, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి మిల్కా, డిప్యూటి సీఈవో రాథోడ్ రాజేశ్వర్,ఐటీడీఏ డీడీ అంబాజీ జాద వ్, ఐటీడీఏ ఈఈ తానాజీ జాదవ్, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
మండలంలో పర్యటించిన కేంద్ర బృందం
నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంపై ప్రశంస
విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమశాఖ, ఐకేపీ, కేంద్ర పథకాలపై ఆరా
కేంద్ర బృందానికి స్వాగతం
కై లాస్నగర్: నీతి ఆయోగ్ కింద ఎంపికై న నార్నూర్ మండలంలో పర్యటించేందుకు గాను జిల్లాకు మంగళవారం విచ్చేసిన కేంద్ర బృందం ప్రతినిధులను కలెక్టర్ రాజర్షి షా మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్ హౌస్లో కలసి పూలమొక్క అందజేసి స్వాగతం పలికా రు. జిల్లాకు సంబంధించిన స్థితిగతులను వారికి వివరించారు.