
నీటిబొట్టుకూ ఓ లెక్క
● భూగర్భ జలాల వినియోగంపై చార్జీలు ● ఫ్లోమీటర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు ● వ్యాపార, వాణిజ్య సంస్థలకు నోటీసులు ● క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాలవిచ్చల విడి వినియోగాన్ని భూగర్భ జల శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గృహ, ప్రజావసరాలు మినహా వ్యా పార కేంద్రాల్లో ఇష్టారీతిన నీటి తోడకాన్ని తగ్గించేలా ప్రతీ నీటిబొట్టుకు లెక్కగడుతూ ఆ మేరకు చార్జీ లు వసూలు చేస్తోంది. కమర్షియల్ కేంద్రాలైనకంపె నీలు, పరిశ్రమలనుంచి వినియోగచార్జీలు తీసుకునే లా 2023లోనే తీసుకొచ్చిన నూతన విధానాన్ని అ మలుచేస్తూ ప్రతీ 1కేఎల్(వెయ్యి లీటర్లు)కు రూపా యి చొప్పున చార్జి వసూలు చేయనున్నారు. గతంలో వాల్టాచట్టం ప్రకారం ఆయా యాజమాన్యాలు నీటివాడకం కోసం ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ) ని మూడేళ్లకోసారి పునరుద్ధరణ చేసేవారు. కొత్త ని బంధనల ప్రకారం ఎంత నీరు వాడితే అంత చార్జీ లు చేస్తూ ప్రతీనెల విద్యుత్ బిల్లు మాదిరిగానే నీటి బిల్లు ఆన్లైన్లో చెల్లించేలా సిద్ధం చేశారు. ప్రస్తుతం సింగరేణి, దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీ వంటి సంస్థల్లో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి.
ఫ్లో మీటర్లు బిగింపు..
నీటిని వాడుతున్న ఆయ సంస్థలు, కంపెనీలు కచ్చితంగా భూగర్భ జలాల వాడకంపై డిజిటల్ ఫ్లో మీటర్తో కూడిన టెలిమీటర్కు అనుసంధానం చేసుకోవాలి. ఈ ఫ్లో మీటరు ప్రతీ ఆరు గంటలకు ఎంత నీటిని వాడారో లెక్కించి ఆన్లైన్లోనే వివరాలు పంపిస్తుంది. దీంతో ప్రతీ నెల ఆయా సంస్థలు జల వాడకానికి తగినట్లుగా చార్జీలు చెల్లించాలి. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల్లో అమలవుతోంది. వీటితోపాటు సిమెంటు, ఇతర మైనింగ్ కంపెనీలు, నీరు అధికంగా వినియోగిస్తు న్న సంస్థలకు ఆయా జిల్లాల భూగర్భ జల అధికా రులు వెళ్లి తనిఖీ చేస్తూ ఫ్లో మీటర్లను బిగించుకునేలా చూస్తున్నారు. కొత్త విధానంపై ఇంకా చాలా మందికి అవగాహన లేకపోవడం, డబ్బులు కట్టా ల్సి వస్తుందని కొన్ని చోట్ల స్పందించడం లేదు.
వాడకమున్నా వసూళ్లు లేవు
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేటు తాగునీటి ప్లాంట్లు, కంపెనీలు, పరిశ్రమలు, ఖనిజ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. యాజమాన్యాలు తమ బోర్వెల్స్ను రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్లో మీటర్లు అమర్చుకోవాల్సి ఉంది. కానీ చాలాచోట్ల వ్యాపారులు ముందుకు రావడం లేదు. అనధికారికంగానూ బోర్వెల్స్, పంపుసెట్లు, వాగులు, వంకలు, చెరువుల నుంచి నీటిని తోడేస్తున్నారు. ఎండాకాలంలో ఈ వాడకం తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సంస్థ నిత్యం వేలాది లీటర్ల నీటిని వినియోగిస్తున్నా లెక్కాపత్రం లేకపోవడంతోపాటు వినియోగంపైనా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అలాంటి చోట్ల అధికారులు వెళ్లి మొదట నోటీసులు ఇస్తున్నారు. కొంత గడువు ఇచ్చాక జరిమానా విధిస్తున్నారు. చాలా చోట్ల యాజమన్యాలు ఈ నోటీసులను సైతం పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 2024నుంచి 2025 ఫిబ్రవరి వరకు భూగర్భ జల శాఖ వివరాలు
జారీ చేసిన ఎన్వోసీలు 101
రిజిస్ట్రేషన్ ఫీజులు(వాల్టా, పరిశ్రమ, మైనింగ్) రూ.15,12,448
విధించిన జరిమానాలు రూ.1,65,000
వసూలైన భూగర్భజల వినియోగ చార్జీలు రూ.3,02,64,788