అటవీ సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

Mar 22 2025 1:57 AM | Updated on Mar 22 2025 1:52 AM

ఆదిలాబాద్‌టౌన్‌: వివిధ రకాల సంపదతో గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తున్న అడవిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎఫ్‌ఆర్‌వో గులాబ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డీఎఫ్‌వో కార్యాలయం వద్ద ఆయన బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిలో నివాసముండే గిరిజనులకు అక్కడే జీవనోపాధి దొరుకుతుందని చెప్పారు. అడవిలో నిప్పు చెలరేగినా.. ఎవరైనా చెట్లు నరికినా.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇంటికి ఐదు మొక్కల చొప్పున నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రమోద్‌కుమార్‌, సెక్షన్‌ ఆఫీసర్లు అహ్మద్‌ఖాన్‌, గులాబ్‌, ధన్‌సింగ్‌, మొహబ్బత్‌రావు, బీట్‌ ఆఫీసర్లు సవిత, జ్యోతి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement