ఆదిలాబాద్టౌన్: సికిల్సెల్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో సికిల్సెల్పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికిల్సెల్ వ్యాప్తి, కట్టడి తదితర విషయాలను ప్రొజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు వివరించారు. సికిల్సెల్, ఎనీమియాతో అనేక మంది బాధపడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన పోషకాల గురించి వైద్యులకు తెలియజేస్తున్నట్లు చె ప్పారు. వారు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించా లని ఆదేశించారు. 2047 వరకు రాష్ట్రంలో సికిల్సె ల్, ఎనీమియా లేకుండా చేయడంలో ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సికిల్సెల్తో కణాలు రక్త సరఫరాకు అడ్డంకిగా మారుతాయని చెప్పారు. ప్ర ధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది ఎక్కవగా ఉంద ని తెలిపారు. కేరియర్లో ఎలాంటి లక్షణాలుండవ ని, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కౌన్సిలింగ్ ఇస్తే వ్యాప్తిని ఆరికట్టవచ్చని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఏటీడీవో అనిల్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.