ఆదిలాబాద్టౌన్: పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం శిబిరాన్ని కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి స మస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 మంది సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు చె ప్పారు. వారిని పరీక్షించిన వైద్యులు వైకల్య శాతాన్ని నిర్ధారిస్తారని తెలిపారు. యూడీఐ డీ ద్వారా అర్హుల ఇంటికే నేరుగా సర్టిఫికెట్లు పంపించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో సదరం క్యాంపులు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలి పారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీడబ్ల్యూవో మిల్కా, సూపరింటెండెండ్ అశోక్, ఆయా విభాగాల వైద్యులు పాల్గొన్నారు.