ఇక్కడ కనిపిస్తున్నవి పట్టణంలోని ఆర్టీవో కార్యాలయ సమీపంలో గల మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ దృశ్యాలు. ఫలితంగా నీరంతా ఇలా రోడ్డుపై వృథాగా పోతోంది. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లా కేంద్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
●
ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం
ఇప్పటికై తే పట్టణంలో నీటి సమస్య అంతగా లేదు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఏప్రిల్ 15 నాటికి లాండసాంగ్వీ పంప్హౌస్లో సమస్య తలెత్తే అవకాశముంది. దీనిని అధిగమించేందుకు ట్యాంకర్లను పెంచేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. లీకేజీలను అరికట్టేందుకు దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని తగు చర్యలు తీసుకుంటాం.
– పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్
కై లాస్నగర్: గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్, వాల్వ్ల లీకేజీల కారణంగా నిత్యం వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. సకాలంలో గుర్తించకపోవడం, మరమ్మతు పనుల్లో జాప్యం అవుతుండడంతో పలు కాలనీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా మార్చిలోనే నీటి గోస మొదలైంది. ప్రస్తుతం పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్ది భూగర్భజలాల మట్టం తగ్గి నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. బల్దియా అధికారులు మేల్కొని ప్రత్యేక దృష్టి సారించకుంటే ఈ వేసవిలో పట్టణవాసులకు నీటి తిప్పలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పలుచోట్ల ట్యాంకర్ల ద్వారా..
బల్దియా పరిధిలో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ కేఆర్కే కాలనీ, భగత్సింగ్నగర్, ఖర్షీద్నగర్ వంటి కాలనీల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. దీంతో ఆయా చోట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బల్దియాకు సంబంధించి ఆరు ట్యాంకర్లు ఉండగా మరో మూడింటిని అద్దె ప్రాతిపాదికన తీసుకున్నారు. ప్రస్తుతం 170 సర్వేనంబర్ కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. అక్కడ సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపడుతుండటంతో భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో ఆ కాలనీలకు ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఒక్కో ట్యాంకర్ రోజుకు తొమ్మిది ట్రిప్పుల చొప్పున సరఫరా చేస్తున్నాయి. మిగతా కాలనీల్లోనూ సమస్య తలెత్తితే మరిన్ని ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.
రోజు విడిచి రోజు సరఫరా
ఆదిలాబాద్ పట్టణానికి రోజుకు 31.90 ఎంఎల్డీల నీరు అవసరం. ప్రస్తుతం 24ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఇందులో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాటేగాం సమీపంలోని ఫిల్టర్బెడ్ నుంచి రోజుకు 18ఎంఎల్డీల నీరు మిషన్ భగీరథ ద్వారా అందుతోంది. అయితే కొన్ని కాలనీల కు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వీ పంప్హౌస్ నుంచి 6ఎంఎల్డీలు సరఫరా అవుతుండగా ఇక్కడి నుంచి 17 వార్డులకు నీటిని అందిస్తున్నారు. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మావల చెరువు నుంచి 1.5 ఎంఎల్డీల నీరు ఫిల్టర్బెడ్కు అందుతుంది. ఇక్కడి నుంచి ఏడు వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణంలోని 24 వార్డులకు నిత్యం నీటిని సరఫరా చేస్తుండగా మరో 25 వార్డులకు మాత్రం రోజు విడిచి రోజు అందిస్తున్నారు.
● బల్దియా పరిధిలో ‘భగీరథ’ లీకేజీలు ● నిత్యం 8ఎంఎల్డీల