నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన రాజశేఖర్–సుగుణ దంపతుల కుమార్తె బి.స్వాతి. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, జావెలిన్ త్రో ఈవెంట్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటలు సాధన చేస్తున్నానని చెబుతోంది. మరిన్ని క్రీడా ఈవెంట్లలో సత్తా చాటడానికి, నిరంతరం క్రీడా నైపుణ్యాలు అలవర్చుకుంటానని తెలుపుతోంది.
– స్వాతి