ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా హాజరై విద్యార్థినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్దాలుగా సంస్కృతి, సంప్రదాయాలు మహిళలను ఆరాదిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. చదువును డిగ్రీతో ఆపేయకుండా కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో వారియర్లుగా దైర్య సాహసాలు ప్రదర్శించాలన్నారు. గతంలో త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నానని పీవో పేర్కొన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అభినవ్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.