ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ వేగవంతం చేయాలి

Mar 6 2025 2:07 AM | Updated on Mar 6 2025 2:07 AM

కైలాస్‌నగర్‌: జిల్లాలో 17 గ్రామాల్లో ఎంపిక చే సిన 2,148 ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత శాఖ అధి కారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబంధించిన పరిశీలన ప్రక్రియ ఈనెల 7లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే 15 మంది అమరవీరుల కుటుంబాలకు ముత్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో నివాస స్థలాలను వారి అభిప్రాయం మేరకు కేటాయించామన్నారు. ఆ నివాస స్థలాల అభివృద్ధి పను ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. అలాగే నీటి ఎద్దడి ఉన్న ఏడు క్రిటికల్‌ మండలాలైన ఆదిలాబాద్‌ రూర ల్‌, బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్‌, సిరికొండ, ఉట్నూర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ బసవేశ్వర్‌, ఎంిపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తాపీమేసీ్త్రలకు కిట్‌ల పంపిణీ

అంతకు ముందు నేషనల్‌ అకాడమీ కన్‌స్ట్రక్షన్‌ ద్వారా తాపీమేసీ్త్రలకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అంది స్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించా రు. వారికి నిర్మాణ సామగ్రితో కూడిన కిట్‌లను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement