● ‘ప్రజావాణి’కి 64 దరఖాస్తులు
● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్
కై లాస్నగర్: తమ గోడు ఆలకించి సమస్యలు పరి ష్కరించాలని పలువురు బాధితులు గ్రీవెన్స్లో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికా రులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీ, విద్య, వైద్యం, ఇరిగేషన్, రెవెన్యు తదితర శాఖలకు సంబంధించి ఈ వారం మొత్తం 64 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..