ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్ను నగదు పురస్కారం వరించింది. దేశీదారు కట్టడితో పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈమేరకు హైదరా బాద్లోని ఎకై ్సజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, జాయింట్ కమిషనర్ ఖురేషీ చేతుల మీదుగా ఆయన రూ.12వేల నగదు పురస్కారం అందుకున్నారు. పలువురు అధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.