
డ్రైవర్ స్టీరింగ్ సీట్ నుంచి బస్సు ఎక్కుతున్న మహిళ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తిరుపల్లి కాలనీలోని బ్రాహ్మణ సమాజ్ శ్రీరామాలయంలో ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బస చేశారు. చాతుర్మాస దీక్ష ముగించుకొని వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను దర్శించుకోవడానికి పలువురు భక్తులు తరలివచ్చారు.
మహిళలతో కిక్కిరిసిన బస్టాండ్
నిర్మల్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆది వారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. నిర్మల్ నుంచి ఆదిలా బాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేందుకు పోటీపడ్డారు. బస్సుల్లో సీటు దొరుకుతుందో లేదో అనే భయంతో డ్రైవర్ స్టీరింగ్ సీటు పైనుంచి ఎక్కారు. దీంతో ఏదైనా ప్రమాదం జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.