
బాసర ఆలయంలో భక్తుల రద్దీ
భైంసా: పవిత్ర కార్తీకమాసం అందులోనూ ఆదివారం కలిసిరావడంతో బాసర చదువులమ్మ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాస ద్వాదశి శుభముహూర్తం ఉండడంతో గోదావరిలో స్నానాలు ఆచరించి, జ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నా రు. దాదాపు 550మంది చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయించారు. అష్టోత్తర కుంకుమార్చన, రుద్రాభిషేకాలు కొనసాగాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్నివిధాల ఆలయ అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. దాదాపు రూ. 65వేల వరకు ఆలయానికి ఆదాయ సమకూరింది.
మొక్కు తీర్చుకున్న భక్తులు..
పదేళ్లుగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని, ఈసారి ప్రభుత్వం మారాలని మొక్కుకున్న భక్తులు ఆదివారం తమ మొక్కును తీర్చుకున్నారు. అమ్మవారి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. ఇందులో వీరశైవ లింగాయత్ సంఘం కార్యవర్గ సభ్యులు సంజీవ్రావ్ దేశాయ్, సీనియర్ నాయకులు వినయ్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.