నిజాయితీ చాటిన ఆర్టీసీ డ్రైవర్
నిర్మల్టౌన్: బస్సులో ప్రయాణికుడు పోగొ ట్టుకున్న బ్యాగ్ను తిరిగి అప్పగించి ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికుడు అభినవ్రెడ్డి ని ర్మల్ బస్టాండ్ నుంచి ఆదివారం హైదరా బా ద్ వెళ్తున్న బస్సేక్కాడు. బస్టాండ్కు చేరుకున్నాక అందరూ దిగి వెళ్లారు. ఈ క్రమంలో డ్రైవర్ షాకిర్ అలీకి బస్సులోని సీటులో బ్యా గ్ గమనించాడు. అందులో రూ.50 వేల నగ దు, ఐఫోన్ ఉంది. అప్పుడే ఫోన్కు కాల్ రావడంతో డ్రైవర్ హైదరాబాద్ బస్టాండ్కు వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు. దీంతో బాధితుడు బ స్టాండ్కు రావడంతో స్టేషన్ మేనేజర్ వివరా లు సేకరించి, ఆ బ్యాగ్ను అప్పగించాడు. ఈ సందర్భంగా డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు.
12న ఉమ్మడి జిల్లా హాకీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జోనల్ స్థాయి (ఉమ్మడి జిల్లా) బాలబాలికల హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఈ పోటీలకు హాజరుకా వాలని తెలిపారు. ఎంపిక పోటీలకు హాజర య్యే క్రీడాకారులు అన్నీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10గంటలకు కన్వీనర్ కమలాకర్రెడ్డి, పోటీల ఆర్గనైజర్ జాదవ్ రవీందర్కు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
సర్పంచ్కు ఎమ్మెల్యే పరామర్శ
నిర్మల్: మామడ మండలం కొరటికల్కు చెందిన సర్పంచ్ బాపురెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వడ్డేపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అందులోని సర్పంచ్కు గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, బీజేపీ నేతలు వెళ్లి పరామర్శించారు.