
బస్సు ఎదుట యువతుల సంబురం
వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
‘మహాలక్ష్మి’కి భారీ స్పందన●
● తొలిరోజు 65,953 మంది ఉచిత ప్రయాణం
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మహిళా ప్రయాణికులు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆర్టీసీ రీజియ న్ పరిధిలో 65,953 మంది మహిళా ప్రయాణికులు తొలిరోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. అత్యధికంగా మంచిర్యాల డిపో పరిధిలో 18,331 మంది,నిర్మల్లో 16,627, ఆదిలాబాద్లో 10,874, భైంసాలో 10,519, ఆసిఫాబాద్లో 5,509, ఉట్నూ రు డిపో పరిధిలో 4,093 మంది పథకాన్ని సద్విని యోగం చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
నేటి నుంచి మళ్లీ ప్రజావాణి
● అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్
కై లాస్నగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిలిచిపోయిన ప్రజావాణి అర్జీల స్వీకరణ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్రాజ్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఈ ఏడాది అక్టోబర్ 9వ నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రసు తం ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరడం, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా స్థాయిలోనూ ప్రజావాణిని పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్కు హాజరై నివేదించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్తీక వనభోజనం
తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి) అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజ నాలు చేపట్టారు. గ్రామంలోని 1వ అంగన్వాడీ సెంటర్ పరిధిలోని చిన్నారులు, తల్లులు టీచర్ స్వరూప ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్కు తరలివచ్చారు. వన భోజనాల అనంతరం చిన్నారులు పార్క్లో సందడి చేశారు.