
కైలాస్నగర్:విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమా న్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పట్టణంలో ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మె ల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, పంచకర్మలను సృష్టించిన విశ్మకర్మ సృష్టికే మూలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ వాటిపై ఆధారపడ్డ వారికి అండగా నిలు స్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మహానీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కుష్బూ గుప్తా, శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజలింగు, ఆర్డీవో స్రవంతి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.