breaking news
Yogesh Khanna
-
ఇలాంటి కేసుల్లో కళ్లు మూసుకుని కూర్చోలేం: సాకేత్ కోర్టు
నిర్భయ కేసులో దోషుల నేరం సహించరానిదని, వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని సాకేత్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు జడ్జి యోగేష్ ఖన్నా.. శుక్రవారం నాడు నిర్భయ కేసులో్ తీర్పు వినిపించే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులు నలుగురికీ ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన కుమార్తెకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి కోర్టును కోర్టును అభ్యర్థించారు. వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని, అందుకే దోషులందరికీ మరణదండన విధించామని యోగేష్ ఖన్నా అన్నారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని, ఇలాంటి దారుణాలపై కళ్లుమూసుకుని కూర్చోలేమని తెలిపారు. మహిళలపై రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో మౌనంగా ఉండలేమని, ఈ శిక్ష ఒక ఉదాహరణగా నిలవాలని అన్నారు. మహిళల్లో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
నిర్భయ కేసులో నేడు తుది తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన 'నిర్భయ' కేసుకు సంబంధించిన తీర్పు మంగళవారం ఢిల్లీ కోర్టు వెల్లడించనుంది. 2012 లో డిసెంబర్ 16 తేదిన జరిగిన గ్యాంగ్ రేప్ పార్లమెంట్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలల క్రితం 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ కదులుతున్న బస్ లో గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన దేశ ప్రజలను కలిచివేసింది. దక్షిణ ఢిల్లిలో మునిర్కా ప్రాంతోలో తన స్నేహితుడితో కలిసి బస్ లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిర్భయ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచింది. దాంతో దేశ ప్రజలందరూ విషాదం మునిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు మరణ శిక్ష విధించాలని దేశంలోని అత్యధిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. నిర్భయ కేసులో 2013 జనవరి 3 తేదిన చార్జిషీట్ దాఖలు కాగా, విచారణ ఫిబ్రవరి 5 తేదిన ప్రారంభించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను, డిఫెన్స్ 17 మందిని విచారించారు. ఈ కేసులో మరో ముద్దాయి రాంసింగ్ తీహార్ జైల్లో ఉరి వేసుకుని మరణించడంతో కేసు నుంచి తప్పించారు. అయితే మిగిలిన ముద్దాయిలు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ల భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం తేల్చనున్నారు. ఈ కేసులో నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, హత్యాప్రయత్నం, సాక్షాలను మాయం చేయడం, దోపిడితోపాటు ఇతర నేరాలను నలుగురు నిందితులపై మోపారు. ఈ కేసులో సాక్ష్యాలు రుజువైతే వీరికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో మైనర్ గా ఉన్న నిందితుడిని ఆగస్గు 31 తేదిన జువెనైల్ జస్టిస్ బోర్డు కు పంపారు. అయితే మైనర్ బాలుడికి విధించిన శిక్షపై బాధిత కుటుంబం ఆందోళన, నిరసనను వ్యక్తం చేశారు. మైనర్ నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని నిర్భయ కుటుంబం డిమాండ్ చేసింది.