-
చొప్పదండి: ఓటింగ్లో మహిళా ప్రభంజనం
సాక్షి, గంగాధర(చొప్పదండి) : పంచాయతీ ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా పోలింగ్లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ముందుండే పురుష ఓటర్లు పోలింగ్లో మాత్రం వెనుకబడి పోతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఓటర్లలోను మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆరు మండలాల్లో 2,12,734 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,04,482 మంది ఉండగా, మహిళలు 1,08,246 మంది ఉండగా ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. శుక్రవారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో 1,69,334 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించారు. మండలాల వారీగా ఓటు హక్కును అందులో మహిళలు ఓటుహక్కును వినియోగించుకన్నది పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఓటు గెలుపోటము లపై ప్రభావం ఉంటుందని పలువురంటున్నారు. -
చెల్లెకు శ్రీరామ‘లక్ష’
అన్న అభయహస్తం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అక్షరాలా మహిళా పక్షపాతి. వారు మహరాణుల్లా జీవించాలని ఆయన అనునిత్యం తపించారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలూ పాటుపడ్డారు. వారు తమ కాళ్లపై తాము నిలబడటమే గాక సమాజాన్ని కూడా నడిపించాలని వైఎస్ నిత్యం చెప్పేవారు. సామాజికంగానే గాక ఆర్థికంగా కూడా పురుషుల కంటే మెరుగ్గా, గౌరవప్రదంగా మహిళలు జీవనం కొనసాగించాలని అభిలషించేవారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చివరిదాకా మహిళా పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. తద్వారా వారిపై వడ్డీ భారాన్ని తగ్గించడమేగాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలను లక్షాధికారులుగా మార్చారు. వారి జీవితాలతో పాటు వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపారు. అలా తెలుగు మహిళల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్. అంతేనా...? జీవితపు మలి సంధ్యలో కూడా మహిళలకు ఎక్కడా తలొంచుకునే పరిస్థితి రాకుండా ‘అభయహస్తం’ అందించారు. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో వారికి ఆర్థికంగా ఆసరా కల్పించారు. కానీ వైఎస్ తదనంతర పాలకులు మహిళల పట్ల అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైఎస్ ప్రారంభించిన మిగతా అన్ని పథకాల మాదిరిగానే పావలా వడ్డీనీ, అభయ హస్తాన్నీ ని‘బంధనాల్లో’ ఇరికించి దాదాపుగా అటకెక్కించారు. మహిళల కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ తన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటే సాధికారతకు బాట నాకు ఈసారే ఓటు హక్కు వచ్చింది. తప్పకుండా ఓటేస్తాను. మహిళలు తవు హక్కులను పూర్తిగా సాధించుకోవాలంటే తవు సవుస్యలు తెలిసిన వారిని, వాటిని పరిష్కరించ గలవారినే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకునేందుకు వున చేతిలో ఉన్న అతి శక్తివుంతమైన ఆయుుధం ఓటు. అందుకే దాన్ని ఆచితూచి, పూర్తి విచక్షణతో ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం వునందరి బాధ్యత. వునం వేసే ఓటే వుహిళా సాధికారతకు బాటలు పరుస్తుందని గుర్తుంచుకోవాలి - పి.వి.సింధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సమ ప్రాధాన్యం మా హక్కు చట్టసభల్లో సమ ప్రాధాన్యం మహిళల ప్రజాస్వామిక హక్కు. వారికి అన్ని రంగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. వుహిళా బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలన్నీ వారికి వుూడో వంతు సీట్లు కేటారుుంచాలి. - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం సాధించుకోవాలి మహిళలు ఆదేశించే స్థారుుకి ఎదగాలి. రాజ్యాధికారంపై ఆసక్తి కనబరచాలి. ప్రవుుఖ అంతర్జాతీయు కంపెనీలకు సీఈవోలు వుహిళలే. బాధ్యతల నిర్వహణలో పురుషుల కంటే వుహిళలు ఏ వూత్రం తీసిపోరు. - సౌదామిని, పారిశ్రామికవేత్త పురుషాధిక్యత పోవాలి చట్టసభలకు ఎన్నికవుతున్న వుహిళల సంఖ్యే పరిమితవుంటే, వారి పేరిట భర్తో ఇంకొకరో అధికారాన్ని చలారుుస్తుండటం వురింత బాధాకరం. రాజకీయూలు వుగవారికి వూత్రమేననే ధోరణి వుుందు పోవాలి. - వేదవాణి, సీనియుర్ న్యాయువాది
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement