-
నిరూపిస్తే రాజీనామా చేస్తా
-
నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా: సీపీ రంగనాథ్
వరంగల్: తెలంగాణలో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తాను సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపించారని, అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు సీపీ రంగనాథ్. కేసు విషయంలో నిజాయితీ ఉంటే మూడు సింహాలపై సీపీ ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీపీపై పలు ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఈ వ్యవహారంపై ఈరోజు(మంగళవారం) మీడియా ముందుకొచ్చిన సీపీ.. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తనకు బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం లేదని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాని తెలిపారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండొచ్చని ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. సత్యంబాబు కేసులో తాను విచారణ అధికారిని కాదని, స్పెషల్ ఆఫీసర్గా నందిగామకు పంపించారన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే తాను ఇప్పటివరకూ 10 వేలసార్లు ప్రమాణాలు చేయాలని, ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యం వేస్తోందన్నారు సీపీ. చదవండి: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వరంగల్ సీపీకి షాక్! టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్ప్లాన్ -
వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-
వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ పరువునష్టం దావా
-
బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వరంగల్ సీపీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, జరిగిన పరిణామాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పేపర్ లీక్ కేసులో సంజయ్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్.. వరంగల్ సీపీ రంగనాథ్పై పరువునష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని సంజయ్ కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా సంజయ్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. తన హక్కుల భంగంతోపాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన చేసిన ఆరోపణలపై కూడా పోరాటం చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. నా ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారు. ముందు సీపీ ఫోన్కాల్ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈటల రాజేందర్ ఫోన్ అడిగే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. నా ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని అన్నారు. మీ దగ్గరే నా ఫోన్ పెట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..
పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంతగా జనం
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement